తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ (EC) గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణ ఉద్యోగులకు సంబదించిన పెండింగ్ లో ఉన్న మూడు డీఏ (DA) లలో ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈసీ అనుమతి ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో డీఏల చెల్లింపు విధానంపై ఈసీ ఆరా తీసింది. ఎన్నికల సమయంలో ఇప్పుడెందుకు డీఏ ఇవ్వాలనుకుంటున్నారని సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. తాజాగా రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో ఒక డీఏ విడుదల చేయవచ్చునని, అందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు సైతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా డీఏ కోసం ఈసీని కోరారు. దాంతో ఎట్టకేలకు ఒక డీఏ విడుదలకు అనుమతి ఇచ్చింది ఈసీ.
Read Also : Chandrababu Districts Tour : డిసెంబర్ 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన..పూర్తి షెడ్యూల్ ఇదే