Site icon HashtagU Telugu

Rythu Runa Mafi : రుణమాఫీ ఫై తెలంగాణ రైతుల్లో అనుమానాలు తగ్గట్లే..

Telangana Runa Mafi

Telangana Runa Mafi

తెలంగాణ సర్కార్ ఎప్పుడెప్పుడు రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) చేస్తుందా అని రైతులంతా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15 లోగా రైతుల రుణమాఫీ చేస్తామని..ఎన్ని అడ్డంకులు వచ్చిన తగ్గే ప్రసక్తి లేదని..చెప్పినట్లే చేసి రైతుల ఋణం తీర్చుకుంటామని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పుకొస్తున్నారు. సోమవారం రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం రుణ మాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుందంటూ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయినప్పటికీ రైతుల్లో మాత్రం అనేక అనుమానాలు రేకెత్తిస్తూ టెన్షన్ పెంచుతున్నాయి. పాన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ జరగదు..రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ కాదు..ఐటీ కట్టేవారికి రుణమాఫీ చేయరు..ఇలా అనేక రకాల ప్రచారం జరుగుతుండడం తో రైతుల్లో ఆందోళన పెరుగుతుంది.

ఈ క్రమంలో ఎవరికీ వారు మాట్లాడుకుంటూ అనుమానాలు పెంచుకుంటున్నారు. అయితే ఈ అనుమానాలకు మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. పాన్ కార్డు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంట మీద వచ్చిన ఆదాయానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదని చెప్పారు. అలాగే రేషన్ కార్డు తో సంబంధం లేదని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదని..రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉంటె పైన ఉన్నవి కట్టెయ్యండి..మిగతా రెండు లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు.

Read Also : Liquor Home Delivery : మద్యం కోసం వైన్ షాప్ కు వెళ్తున్నారా..? ఇక మీకు ఆ శ్రమ అవసరం లేదు..!!