MP Candidates Qualifications : లోక్‌‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..

MP Candidates Qualifications : తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది. 

  • Written By:
  • Updated On - April 28, 2024 / 12:51 PM IST

MP Candidates Qualifications : తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది.  ఈ మూడు పార్టీలకు చెందిన 51 మంది అభ్యర్థులు లోక్‌సభ పోల్స్‌‌లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఎంత మంది అభ్యర్థులు ఎంత వరకు చదువుకున్నారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన 51 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో 17 మంది ఇంటర్​, ఆలోపే చదువుకున్నారు.
  • పదో తరగతి అంతకంటే తక్కువ చదివిన లోక్‌సభ అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు.
  • ఇంటర్మీడియట్​ చదివిన లోక్‌సభ అభ్యర్థులు 11 మంది ఉన్నారు.
  • లోక్‌సభ అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు(MP Candidates Qualifications) ఉన్నారు.
  • ఆలిండియా సర్వీసుల అధికారులు ముగ్గురు ఉన్నారు. ఈ లిస్టులో రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్​ నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, నాగర్​ కర్నూల్​ నుంచి రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ బీఆర్​ఎస్​ తరఫున బరిలో నిలిచారు. మరో రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి చొల్లేటి ప్రభాకర్​ నల్గొండ లోక్​సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
  • రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు పోటీ చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ చేశారు. ఒకరు బీటెక్​ చేయగా మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు.
  • ఐదుగురు అభ్యర్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదివారు.
  • ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హార్వర్డ్​ యూనివర్సిటీలో పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​లో మాస్టర్స్​ చేశారు. అసదుద్దీన్​ ఓవైసీ లండన్​లో లా పూర్తి చేశారు. కొండా విశ్వేశ్వర్​రెడ్డి అమెరికాలో ఎంఎస్​ పూర్తి చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేశారు. భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి సైప్రస్​లో హోటల్​ మేనేజ్​మెంట్​ కోర్సు చేశారు.

Also Read :Marriage With Robot : రోబోతోనే ప్రేమ.. త్వరలోనే పెళ్లి.. అతగాడి టేస్టే వేరప్ప!

  • టి.జీవన్​రెడ్డి(కాంగ్రెస్​), బి. వినోద్​కుమార్​(బీఆర్​ఎస్​), రఘునందన్​రావు(బీజేపీ)లు న్యాయ విద్య(ఎల్​ఎల్​బీ) చదివారు.
  • చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డి వెటర్నరీ సైన్స్​లో మాస్టర్స్​(ఎంవీఎస్సీ) పూర్తి చేశారు.
  • మల్లు రవి(కాంగ్రెస్​), కడియం కావ్య(కాంగ్రెస్​), బూర నర్సయ్యగౌడ్​(బీజేపీ), సుధీర్​కుమార్​(బీఆర్​ఎస్​)లు ఎంబీబీఎస్​, ఆపై చదువులు చదువుకొని వైద్యులుగా సేవలందించారు.
  • మహబూబాబాద్​ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్​ అజ్మీరా సీతారాంనాయక్​ పీహెచ్​డీ పూర్తి చేశారు.

Also Read :Tamil Nadu Party : తెలంగాణ ఎన్నికల బరిలో తమిళనాడు రాజకీయ పార్టీ