Site icon HashtagU Telugu

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Nirmalabhatti

Nirmalabhatti

తెలంగాణలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti), మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి ఆమెకు వివరించారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Red Color Radish : ఆరోగ్య రహస్యాల పూట..ఎరుపు ముల్లంగి ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని మీకు తెలుసా?

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వందలాది ఇళ్లు కూలిపోయాయి, పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించి, సహాయ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని వారు కోరారు.

సాయంత్రం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. వరదల వల్ల జరిగిన నష్టంపై ఆయనకు కూడా వివరిస్తారు. రాష్ట్రానికి అవసరమైన సహాయం, ఇతర సహకారాల గురించి చర్చించనున్నారు. ఈ భేటీల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన సాయం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.