Exclusive : తెలంగాణ వాళ్ల అయ్య జాగీరా? క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై డ‌ల్లాస్ ర‌ఘు ఫైర్‌

"టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో" నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. "Hashtag U" ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 02:53 PM IST

“టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో” నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. “Hashtag U” ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు. 2014కు ముందు ఉద్యమ సమయంలో అమెరికా గడ్డపై తెలంగాణ వాదం వినిపించిన రఘువీర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు.. తెలంగాణ ను అయ్య జాగీరులా భావిస్తూ పాలన సాగిస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆస్తిగా తెలంగాణ రాష్ట్రం మారిందనే రీతిలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వస్తే.. వెళ్లి స్వాగతం పలికే ధైర్యం చేయలేని కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాననడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. సామాన్యులను, యావత్ దేశాన్ని ఏ రకంగా మెప్పించగలరని రఘువీర్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ది చేకూర్చడమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పని చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాము(డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్) ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని.. “టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో” నినాదంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.