Site icon HashtagU Telugu

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన కోర్ట్

Kavitha to Tihar jail.. 14 days judicial remand

Kavitha to Tihar jail.. 14 days judicial remand

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam) లో అరెస్టై..తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ప్రశ్నించటానికి ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్‌టాప్‌, ఇతర స్టేషనరీకి తీసుకువచ్చేందుకు సీబీఐకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది. బుచ్చిబాబు ఫోన్ నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆప్ కి చెల్లించిన 100కోట్ల ముడుపులు సహా లిక్కర్ కేసు దర్యాప్తులో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ పై కవితను క్వశ్చన్ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మొదటి నుండి కవిత పేరు మారుమోగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు సార్లు కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈడీ విచారణకు హాజరుకాకుండా, అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత నుంచి ఆమె ఈడీ నోటీసులు పంపిన వాటికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు కానీ విచారణకు మాత్రం హాజరుకాలేదు. కానీ మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు.సోదాలు పూర్తి అయిన తర్వాత మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్టు వారెంట్‌ జారీ చేసి వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చారు. తర్వాత రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం.. కోర్టు ఆమెకు 10రోజుల ఈడీ కస్టడీ ఇవ్వడం…అది ముగిసిన అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించడం చేసారు.

Read Also : Rashmika Mandanna: యానిమల్ మూవీ ట్రోల్స్ పై స్పందించిన రష్మిక.. అలాంటి వాళ్లంటే అసహ్యం అంటూ!