లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎంపిక చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ‘లక్కీ డ్రా’ ద్వారా మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక రెండు […]

Published By: HashtagU Telugu Desk
Jangaon Thorrur Congress

Jangaon Thorrur Congress

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎంపిక చేశారు.

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
  • ‘లక్కీ డ్రా’ ద్వారా మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక
  • రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను వరించిన అదృష్టం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగుతోంది. సోమవారం 7 కార్పొరేషన్లకు, 105 మున్సిపాలిటీలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కోరం లేకపోవటం, ఇతర అనివార్య కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నేటికి వాయిదా పడగా.. నేడు ఎన్నిక నిర్వహించారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ‘అదృష్టం’ వరించింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.

జనగామ మున్సిపాలిటీని అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికను నిర్వహించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు వేసిన తర్వాత కూడా రెండు పార్టీలకు కూడా సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా…బీఆర్ఎస్ పార్టీ చైర్మెన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్ సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా వేశారు. ఇద్దరి పేర్లు రాసి డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను ఛైర్మన్‌గా ప్రకటిస్తూ అధికారులు ధృవీకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ఇక తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరులో మెుత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే తేజస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య రిజస్టర్ చేసుకున్నారు. వారు ఓట్లు కూడా కలుపుకొని కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఇవాళ ఎన్నిక నిర్వహించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సమానంగా చెరో 9 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్‌ను ఎంపిక చేశారు. 2వ వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ డ్రాలో విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులుఅధికారిక పత్రం అందజేశారు.

ఇక డోర్నకల్, జహీరాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం బీఆర్ఎస్ ఖాతాలో చేరగా.. ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే చేరింది. అయితే ఇక్కడి ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

 

  Last Updated: 17 Feb 2026, 02:18 PM IST