తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం (Education System) మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు. విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, దీనిని సమర్థవంతంగా పునరుద్ధరించేందుకు సమాజం మొత్తం కలిసి రావాలని ఆయన సూచించారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోతే, భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టనున్న ప్రక్షాళన చర్యలు
తెలంగాణ విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల నాణ్యత పెంపునకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విద్యార్థులతో మమేకం కావాలని ఆదేశించారు. విద్యార్థుల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టామని చెప్పారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచే విధంగా ఒక సమగ్ర విధాన పత్రం రూపొందించేందుకు ప్రజల సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు.
నూతన విద్యా విధానానికి మార్గదర్శకం
తెలంగాణ విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులను ప్రాధాన్యతనిస్తూ అమలు చేయనుంది. కేవలం పుస్తక విద్య మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు పెద్దపీట వేయనున్నట్లు సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా రంగంలో తెలంగాణ పోటీ పడేలా మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత ఏడాది విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం, విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం సంస్కరణలను త్వరగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున అయోధ్యలో కార్యక్రమాలివీ..