CM Revanth Reddy : ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు నంబర్ 23లో ఉన్న తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అంతకుముందు వరకు అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ బంగ్లాను ఖాళీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బంగ్లాను విజిట్ చేశారు. మొత్తం భవనాన్ని ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలను కలువనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ చేసిన తీర్మానం వివరాలను వారికి తెలియజేయనున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. హైకమాండ్ సూచనల మేరకు ఈ అంశాలపై సీఎం రేవంత్ నిర్ణయాలను తీసుకోనున్నారు.
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి సీఎం రేవంత్(CM Revanth Reddy) డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ను కూడా సీఎం రేవంత్రెడ్డి కోరారని తెలిసింది. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది.