CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వెంట పలువురు తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీ సందర్భంగా చర్చ జరిగింది.

సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై దృష్టి సారించారు. నగరంలో రద్దీని తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్లు అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ముఖ్యంగా, మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ యోచనను సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఆయన చెప్పారు. ఈ నిర్మాణానికి అవసరమైన భూములను రక్షణ శాఖ నుంచి ఇవ్వాలని కోరారు.

Minister Lokesh : మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి రక్షణకు చర్యలు

అంతేకాకుండా, హైదరాబాద్-కరీంనగర్-రామగుండం‌ను కలిపే రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టు గురించిన చర్చ కూడా జరిగింది. ప్యాకేజ్ జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రయాణీకులకు పెద్ద ఎత్తున సౌకర్యం కలుగుతుందని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని వివరించారు.

ట్రాఫిక్ ప్రాజెక్టులతో పాటు, తెలంగాణలో కొత్తగా సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో విద్యా, రక్షణ రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోవడానికి ఇది దోహదం చేస్తుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ భేటీ ఫలితాలు తెలంగాణలోని మౌలిక వసతుల అభివృద్ధికి కీలకంగా మారతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో

  Last Updated: 10 Sep 2025, 11:20 AM IST