Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ

CM Revanth

CM Revanth

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. నేడు (బుధవారం), రేపు (గురువారం) ఢిల్లీలోనే ఉంటారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో ఆయన భేటీ అవుతారని తెలిసింది. ఈసందర్భంగా తెలంగాణలో మంత్రిమండలి విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో సీఎం సహా  12 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న మరో 6 మంత్రి పదవుల్లో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ పెద్దల సూచనలను రేవంత్ తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ, అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేస్తారని సమాచారం.

Also Read :President Arrested : తెల్లవారుజామునే దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

మంత్రి పదవుల రేసులో వీరే..

Also Read :Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ సింగపూర్, దావోస్ టూర్