Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిరోజు(జనవరి 2) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత టైం ఇవ్వాలని కోరుతూ ఈడీ జాయింట్ డైరెక్టర్కు ఆయన ఒక లేఖను ఈమెయిల్ ద్వారా పంపారు. బీఎల్ఎన్ రెడ్డి అభ్యర్థనకు ఈడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోరోజు విచారణకు పిలుస్తామని బీఎల్ ఎన్ రెడ్డికి ఈడీ బదులిచ్చింది. ఇదే కేసులో రేపు (శుక్రవారం రోజు) అరవింద్కుమార్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. జనవరి 7న ఈడీ ఎదుటకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తమ న్యాయవాదుల సూచన మేరకు ఈడీ విచారణకు హాజరు కావాలో లేదో నిర్ణయం తీసుకుంటానని కేటీఆర్ ఈ నెల 1న మీడియాకు తెలిపారు.
Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
