Kunja Satyavathi : అర్ధరాత్రి ఆకస్మిక గుండెపోటు.. మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం!

Kunja Satyavathi : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 09:03 AM IST

Kunja Satyavathi : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.  అయితే మార్గం మధ్యలోనే సత్యవతి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న గుండెపోట్లు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లలో పలువురు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు ఆకస్మిక గుండెపోట్లతో ప్రాణాలు విడిచారు. తాజాగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు.

We’re now on WhatsApp. Click to Join.

కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ లో చేరారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతర పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్ సీపీలోకి చేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెసులోకి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ, ఇతర ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. చివరకు 2017లో బీజేపీలో చేరారు.2019లో బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.

Also Read: Thiruvananthapuram Rains: మంచాన పడిన మహిళను రక్షించిన పోలీసులు