Banakacherla Project : బనకచర్ల వల్ల తెలంగాణ కు నిజంగా నష్టం ఏర్పడుతుందా..?

Banakacherla Project : ఈ ప్రాజెక్టుకు అనుమతులు అవసరం కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ఇది మిగిలిపోయే నీటిని మాత్రమే వినియోగించేందుకు లక్ష్యంగా తీసుకుంటున్నారు

Published By: HashtagU Telugu Desk
Banakacherla Project

Banakacherla Project

బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) పేరుతో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా కవిత (Kavitha) వంటి నేతలు దీనిని తెలంగాణ ప్రజల మనస్సులను రెచ్చగొట్టేందుకు ఒక ఆయుధంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) నేతలు బనకచర్ల ద్వారా చంద్రబాబు తెలంగాణ నీటిని లాక్కుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్పందించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు నిజానికి ఆధారాలు లేనివే. అసలు బనకచర్ల వల్ల తెలంగాణ(Telangana )కు నష్టం ఏమిటో మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పడంలేదు.

PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్‌డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ

బనకచర్ల ప్రాజెక్టు ఒక సాధారణ ఎత్తిపోతల పథకం. ఇది వరద సమయంలో సముద్రంలోకి వృథాగా పోయే నీటిని భద్రంగా నిల్వ చేసుకుని వాడుకునే ప్రయత్నం. ఇది శ్రీశైలం లేదా సాగర్ డ్యామ్‌ల నుంచి నీటిని అక్రమంగా తీసుకునే ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు అవసరం కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ఇది మిగిలిపోయే నీటిని మాత్రమే వినియోగించేందుకు లక్ష్యంగా తీసుకుంటున్నారు. ఇది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లాభం, ఎందుకంటే అదే వరద తెలంగాణ వైపు కాకుండా సముద్రంలోకి పోతుంది. ఆ నీటిని వాడుకుంటే తెలంగాణకు నష్టం ఏమిటి?

YCP : క్యాడర్, లీడర్లను బలి పశువులుగా వాడుకుంటున్న జగన్..?

ఇలాంటి విషయాల్లో ప్రజల చైతన్యాన్ని ఉపయోగించుకోవాలి కానీ చిచ్చుపెట్టి ద్వేష రాజకీయాలకు ప్రోత్సాహం ఇవ్వకూడదు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు బలంగా ఉన్నా, ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు సహకారంతో ఎదగాలన్న అభిలాషతో ఉన్నారు. ఇప్పుడు కూడా “ఏపీ నీటిని దొంగలిస్తోంది” అనే వాదనలు ప్రజలను ఆకర్షించవు. బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్న వారు, దాని పై స్పష్టమైన సాంకేతిక కారణాలు చెబితేనే ప్రజలు నమ్ముతారు. లేదంటే ఈ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరణతో నింపిన గాలి మాటలే అవుతాయి.

  Last Updated: 05 Jun 2025, 12:34 PM IST