Site icon HashtagU Telugu

HYD – MMTS : యువతిపై అత్యాచారయత్నం

Hyderabad MMTS

Mmts

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ (Secunderabad Railway Police Station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్‌కి వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతి (23) ఒంటరిగా ప్రయాణిస్తుండగా, ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి (Rap Attampet) పాల్పడ్డాడు. తనను కాపాడుకునే ప్రయత్నంలో ఆ యువతి నడుస్తున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటన కొంపల్లి సమీప రైలు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!

పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి, తన సెల్‌ఫోన్ రిఫేరింగ్ కోసం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. తిరిగి మేడ్చల్‌కి బయలుదేరే సమయంలో మహిళల కోచ్‌లో ఎక్కింది. అయితే మార్గమధ్యంలో ఇతర మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో, ఆమె ఒక్కరే మిగిలిపోయింది. ఇదే ఆసరాగా తీసుకుని ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. అతడి నుండి తప్పించుకునేందుకు యువతి రైలు నుంచి దూకడం వల్ల తీవ్రంగా గాయపడింది.

Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. రైల్వే కోచ్‌లలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మిగతా ప్రయాణికులు కోరుతున్నారు.

Exit mobile version