Road Accident: వరంగల్‌ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ఊకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు.

Published By: HashtagU Telugu Desk
Road Accident

Road Accident

Road Accident: వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ఊకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు.

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జవాన్ చల్లా శ్రీనివాస్ (32) గా గుర్తించారు. శ్రీనివాస్, అతని భార్య భవాని వరంగల్ నుంచి బైక్‌పై మణుగూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనంపై అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్ర గాయాలపాలైన భవానీ వరంగల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవులో ఉన్నారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అన్నవరం తరలించారు.

Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్

  Last Updated: 27 Feb 2024, 06:26 PM IST