TET Fee : తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. గతంలో టెట్ ఒక పేపర్కు పరీక్ష ఫీజు రూ.200 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.1000కి పెంచారు. టెట్ ఎగ్జామ్ను రెండు పేపర్లకు రాస్తే గతంలో ఫీజు రూ.300 ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.2,000కు పెంచేశారు. టెట్ పరీక్ష ఫీజుల పెంపుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. టెట్ ఫీజుల పెంపు వ్యవహారం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకు వివరించాయి. దీంతో సమస్య తీవ్రతరం కాకముందే ఫీజును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు. కోచింగ్, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజులు అదనపు భారంగా మారాయని టెట్ అభ్యర్థులు(TET Fee) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- రాష్ట్రంలో మార్చి 15న టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.
- మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
- ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
- అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్లైన్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
- మే 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు.
- 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
- టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
- డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ లో నిర్వహించనున్నారు.
- టెట్ నిర్వహణ తప్పనిసరి కావడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ జూన్ 20 వరకు పొడిగించింది.