Telangana Youth : తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ ముప్పును ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 60 ఏళ్లు దాటాక రావాల్సిన సమస్యలు 30 ఏళ్లకే ముసురుకుంటుండటం కలవరం రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారికి వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (NCD) స్క్రీనింగ్ చేస్తోంది. ఈ వైద్య పరీక్షల్లోనే పైవిషయాలు వెలుగుచూశాయి.
We’re now on WhatsApp. Click to Join
- తెలంగాణ వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ స్క్రీనింగ్ రిపోర్టు ప్రకారం.. తెలంగాణ యువతలో 12.4 శాతం మంది రక్తపోటు, 6.6 శాతం మంది షుగర్తో బాధపడుతున్నారు.
- రాష్ట్రంలో 30 ఏళ్లుదాటిన వారు(Telangana Youth) 1.82 కోట్ల మంది ఉన్నారు.
- 30 ఏళ్లుదాటిన వారందరికీ ఎన్సీడీ స్క్రీనింగ్ చేసేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటింటి సర్వే చేస్తోంది.
- జనవరి చివరి నాటికి 1.51 కోట్ల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 19.21 లక్షల మందికి బీపీ ఉందని వెల్లడైంది. 9.98 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది.
- మెుత్తం యువతలో 19 శాతం మంది బీపీ, షుగర్ రెండింటిని ఎదుర్కొంటున్నట్లు వెలుగుచూసింది.
- జిల్లాలవారీగా చూస్తే.. తెలంగాణలో బీపీ, షుగర్ బాధితులు అత్యధికంగా మెదక్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లాలో 30 ఏళ్లు దాటిన 3,57,153 మందికి పరీక్షలు చేయగా 83,581 మందికి బీపీ, 51,247 మందికి షుగర్ ఉన్నట్లు తెలిసింది.
- మెదక్ జిల్లాలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో 23 శాతం మంది బీపీ, 14 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది.
- ఎన్సీడీ సర్వేలో రెండో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది.
- వరంగల్ జిల్లాలో 4,31,949 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 68,657 మందికి బీపీ, 34,716 మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. 16 శాతం మంది బీపీ, 8 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
బీపీ, షుగర్ రావడానికి కారణాలు
- తీవ్రమైన ఒత్తిడిలో పని చేయడం, సమయానికి తినకపోవటం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం వంటి కారణాల వల్ల బీపీ, షుగర్ ఎటాక్ చేస్తాయి.
- గుండె, మూత్ర పిండాల జబ్బులు, కేన్సర్ కేసులు కూడా తెలంగాణలో పెరుగుతున్నాయి.
- జీవన శైలిలో మార్పులు చేసుకొని తగినంత వ్యాయామం, సమయానికి భోజనం, కంటినిండా నిద్రపోతే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.