Amit Shah: తెలంగాణ‌పై బీజేపీ దృష్టి.. నేడు సిద్దిపేటకు అమిత్ షా

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట‌ వేదికైంది.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 10:18 AM IST

Amit Shah: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట‌ వేదికైంది. గురువారం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. షా ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ జి. కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు, పలువురు సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ కూడా గురువారం కరీంనగర్, నాగర్‌కర్నూల్‌లలో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ర్యాలీలో కూడా ఆయన పాల్గొంటారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ నామినేషన్ ర్యాలీలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి పాల్గొంటారు. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మే 13న తెలంగాణ నాలుగో దశలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తున్నాయి.

Also Read: Jawa Yezdi Motorcycles: జావా బైక్ ఉన్న‌వారికి గుడ్ న్యూస్‌.. రేపు ఫ్రీ పార్ట్ రీప్లేస్‌మెంట్, ఎక్కడంటే..?

తెలుగు రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఏప్రిల్ 30న అందోల్‌లో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్‌లోని శెరిలింగంప‌ల్లిలో ఐటీ ఉద్యోగులతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్, భువనగిరి, నల్గొండ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మే 4న నారాయణపేట, వికారాబాద్‌లలో జరిగే సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని పార్టీ తెలిపింది.

We’re now on WhatsApp : Click to Join