హైద‌రాబాద్‌ గులాబీ మ‌యం.. టీఆర్ ఎస్ ప్లీన‌రీ షురూ..!

హైద‌రాబాద్ - టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల పండుగ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా మొద‌ల‌యింది.

  • Written By:
  • Updated On - October 25, 2021 / 12:09 PM IST

హైద‌రాబాద్ – టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల పండుగ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా మొద‌ల‌యింది. న‌గ‌రం మొత్తం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కేసీఆర్ ఫోటోల‌తో గులాబీమ‌యంగా మారింది. ఈ ప్లీన‌రీలో పార్టీ అధ్య‌క్షుడిగా కేసీఆర్‌ మ‌రోసారి పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌బోతున్నారు.

ఈ వేదిక‌పైనుంచి అక్టోబ‌ర్ 30న జ‌ర‌గ‌బోతున్న హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ గ‌ట్టి సందేశం ఇవ్వ‌బోతున్న‌ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వంగా 6500మందికిపైగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో వైభ‌వంగా ప్లీన‌రీ నిర్వ‌హించాల‌ని ముందుగా భావించినా.. కోవిడ్ దృష్ట్యా వీలైనంత త‌క్కువ మందితోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ..

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌లు, జ‌డ్పీ చైర్మ‌న్‌ల‌తో స‌హా స్ధానిక నేత‌లు చాలామంది ఈ వేడుక‌లో పాల్గొంటున్నారు. 20 ఏళ్ల టీఆర్ఎస్ ప్ర‌స్ధానానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిష‌న్‌ను కూడా ప్లీన‌రీలో ఏర్పాటు చేశారు.

Follow us