32 Students ill: హన్మకొండ జిల్లా భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటున్న 32 మంది విద్యార్థినులు ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. ఆహారంలో కలుషితమైందని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. హాస్టల్ మెస్లో రాత్రి భోజనానికి వడ్డించిన ఎగ్ బిర్యానీ తిన్న తర్వాత వారికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు రావడం వంటి లక్షణాలతో బాధపడ్డారు.
వీరిలో కొందరికి ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించడంతో సోమవారం ఉదయం హన్మకొండ, వరంగల్లోని రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. 15 మంది అమ్మాయిల పరిస్థితి నిలకడగా ఉండడంతో చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, మరో 15 మందిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
కాగా, కడిపికొండ పీహెచ్సీకి చెందిన వైద్యబృందంతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు భట్టుపల్లిలోని ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Ap Politics: వేడెక్కుతున్న రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం జూనియర్!