Site icon HashtagU Telugu

Ganesh Chaturthi 2023: మంత్రి జగదీశ్‌రెడ్డి 3 వేల మట్టి విగ్రహాల పంపిణి

Ganesh Chaturthi 2023

Logo (13)

Ganesh Chaturthi 2023: గణేష్‌ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం సూర్యాపేట మున్సిపల్‌ కార్యాలయంలో గణేష్‌ ఉత్సవ స్మారకస్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

సూర్యాపేటను కాలుష్య రహిత జిల్లాగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా మట్టి గణేష్ విగ్రహాలను మాత్రమే వినియోగించాలని ఇంధన శాఖ మంత్రి ప్రజలను కోరారు. పర్యావరణ పరిరక్షణకు పట్టణంలో ప్లాస్టిక్‌ డిస్పోజబుల్‌ వస్తువులను తగ్గించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేసిందని, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రయత్నాల కారణంగా సూర్యాపేట జిల్లా మెరుగైన చెత్త నిర్వహణలో జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నదని రాష్ట్ర ప్రగతిని కొనియాడారు మంత్రి.

సూర్యాపేటలో గత తొమ్మిదేళ్లుగా మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది 3 వేల పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీ శనివారం నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌లో మట్టి గణేష్ విగ్రహాలు ఉచితంగా లభిస్తాయని మంత్రి తెలిపారు.

Also Read: Lord Shani Blessings: శనివారం రోజు ఇవి చూస్తే చాలు.. శని అనుగ్రహంతో పాటు, కష్టాలన్నీ మాయం?