టెక్నాలజీ రోజురోజుకీ మరింత డెవలప్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం మొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను సరికొత్త ఫీచర్ లతో మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. కాగా మరికొన్ని మొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్ లతో పాటు అతి తక్కువ ధరకే మొబైల్ ఫోన్ లభించే విధంగా అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల సరికొత్త స్మార్ట్ ఫోన్లు సరసమైన ధరలకు లభిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అందిన సమాచారం ప్రకారం..వివో సంస్థ మార్కెట్ లోకి త్వరలోనే మరొక సరికొత్త మొబైల్ ని విడుదల చేయనుంది. వివో ఎక్స్90 సిరీస్ మొబైల్ మార్కెట్ లోకి విడుదల కానుంది. వివో ఎక్స్80 సిరీస్ కు కొనసాగింపుగా వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్ ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది వివో సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ నవంబర్ ఈ నెల 22న చైనాలో విడుదల కానుంది.
ఆ తర్వాత భారత్ లో విడుదల కానుంది. వివో ఎక్స్90 సిరీస్ లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రో,వివో ఎక్స్90ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ లలో లభించునుంది. బ్రైట్ రెడ్ కలర్తో పాటు బ్లాక్ కలర్లో లభించనుంది. కాగా విషయానికి వస్తే..ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్989 1ఇంచ్ ప్రైమరీ కెమెరా సెన్సర్తో పాటు 48 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపీ పోర్ట్రయిట్ టెలిఫొటో కెమెరా, 64ఎంపీ ఒమ్నివిజన్ ఓవీ64బి పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.