Electric Bike: లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రూ.40 కే.. అద్భుతమైన ఫీచర్ లతో?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరిగిపోతుండడంతో ఆటోమొబైల్

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 07:30 AM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరిగిపోతుండడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిని సారిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ ప్రీమియం బైకులను కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇండియన్‌ మార్కెట్​లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్​ బైక్‌లను లాంచ్​ చేసింది. అవి ఎఫ్77, రీకాన్​, ఎఫ్​ 77 లిమిటెడ్​ స్పెషల్ ఎడిషన్​ పేర్లతో ఈ బైక్ లను ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ మూడు బైక్‌ల డిజైన్, ఫీచర్లలో తేడా ఉన్నప్పటికీ వీటి పనితీరు మాత్రం ఒకేలా ఉంటుంది.

అయితే లిమిటెడ్​ ఎడిషన్​ వేరియంట్లు కేవలం 77 యూనిట్లు మాత్రమే మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యాయి. ఇవి విడుదలైన కేవలం 2 గంటల్లోనే సేల్‌ అయిపోయాయి. ఎఫ్77 ఒరిజినల్ వేరియంట్ రూ.3.80 లక్షలు గా ఉంది. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ 27-kW ఎలక్ట్రిక్ మోటార్, IP67-రేటెడ్ 7.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బైక్ 36 bhp వద్ద గరిష్ట శక్తిని, 85Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే 206 కి.మీలు ప్రయాణించవచ్చు. అలాగే అల్ట్రావయోలెట్​ ఎఫ్​77 బైక్ 140 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఇది కేవలం 8.3 సెకన్లలో 0నుంచి 100kmph వేగాన్ని చేరుకోగలదు. ఇది​ ఒరిజినల్ ట్రిమ్ క్రాష్ గార్డ్స్, స్టాండర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. కాగా మనము ఈ వేరియంట్ బ్లాక్​, సిల్వర్​, రెడ్​ కలర్​ ఆప్షన్లలో లభించనుంది.

ఎఫ్ 77 రీకాన్ రూ.4.55 లక్షలుగా ఉంది. ఈ బైక్​ సింగిల్ ఛార్జ్‌తో​ గరిష్టంగా 307 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఒరిజినల్‌ వేరియంట్‌తో పోలిస్తే ఇది మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ బైక్‌కు 10.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ​ఈ బ్యాటరీ 39 bhp వద్ద గరిష్ట శక్తిని, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకోగలదు. కాగా ఎఫ్ 77 స్పెషల్ ఎడిషన్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్​ బైక్‌గా నిలిచింది. ఈ వేరియంట్‌లో కేవలం 77 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభించిన రెండు గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఈ బైక్ రూ.5.50 లక్షలుగా ఉంది.