రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే ఇదే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రిసెర్చ్ నెలనెలా ప్రపంచవ్యాప్తంగా ఏ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అన్న విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్ నెలలో ఏఏ ఫోన్ లు అధికంగా అమ్ముడయ్యాయి అన్న డేటా ని విడుదల చేసింది. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐఫోన్ 13 సీరిస్ ఫోన్ లు ఎక్కువగా అమ్ముడయినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫోన్ అమ్మకాలలో ప్రతి పది మందిలో ఒకరు ఈ ఐఫోన్ ని కొనుగోలు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన టాప్ 10 ఫోన్ల జాబితాలో యాపిల్, శాంసంగ్ ఫోన్లు మార్కెట్ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ సంస్థకు చెందిన స్టాండడ్ ఐఫోన్లలో వనిల్లా ఐఫోన్ 13 అగ్రస్థానంలో నిలవగా ఏప్రిల్ నెలలో 5.5శాతంతో ఎక్కువగా అమ్ముడు పోయి టాప్లో నిలిచింది. అలాగే యాపిల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అత్యధికంగా అమ్ముడు పోయి 3.4 మార్కెట్ షేర్ను నమోదు చేసింది. ఆ తరువాత యాపిల్ ఐఫోన్ 13 ప్రో 1.8శాతం మార్కెట్ షేర్తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఐఫోన్ 12 సైతం మార్కెట్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది.
ఏప్రిల్ నెలలో 1.6శాతం ఫోన్లు అమ్ముడుపోయి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 1.4శాతం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడుపోయి ఐఫోన్ల జాబితాలో 5వస్థానం దక్కించుకుంది. మిగిలిన స్మార్ట్ ఫోన్ సంస్థలకు చెందిన ఏ ఫోన్ లో ఎక్కువగా అమ్ముడు పోయే అనే విషయానికి వస్తే.. 1.5శాతం మార్కెట్ షేర్తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. అలాగే మోస్ట్ అఫార్డబుల్ ఫోన్ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ13 1.4శాతం మార్కెట్ను దక్కించుకుంది. అఫార్డబుల్ గో ఎడిషన్లో శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ ఎక్కువగా అమ్ముడు పోయి 1.4శాతం మార్కెట్ షేర్ను కైవసం చేసుకుంది. మిడ్ రేంజ్ డివైజ్లో శాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్ ఫోన్ నిలిచింది.
1.3శాతం మార్కెట్తో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంది. యాపిల్, శాంసంగ్ సంస్థ మినహాయిస్తే రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోయింది. 1.3 మార్కెట్ షేర్తో యాపిల్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 26న విడుదలైన సమయంలో రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ ధర రూ.12,929గా ఉంది.
ఇక చివరిగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడవుతున్న జాబితాలో 5జీ ఫోన్ల సంఖ్య పెరుగుతున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడైంది. గతేడాది 5జీ ఫోన్లు 4మోడళ్లు అమ్ముడుపోతే ఈ ఏడాది అనూహ్యంగా వాటి సంఖ్య 7కి చేరింది.