టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో దేశవ్యాప్తంగానే కాకుండా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు రకరకాల మోడల్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో వందల మోడల్స్ లో మొబైల్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నెలలో పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఆ వివరాల్లోకి వెళితే..
టెక్నో సంస్థ మార్కెట్ లోకి మరో సరికొత్త ఫోన్ను తీసుకొస్తోంది. టెక్నో పోవా 5 పేరుతో ఈ కొత్త ఫోన్ను తీసుకొచ్చే పనిలో పడింది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుంది అన్న విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ99 ఎస్ఓసీ ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్తో పని చేస్తుందని తెలుస్తోంది.
ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ను అందించనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే..
ఈ స్మార్ట్ ఫోన్లో 10 వాట్స్ చార్జింగ్కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. 21 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. కాగా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లాంచింగ్ తేదీ లాంటి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.