చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 పేరుతో ఈ ఫోనను తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా ఈ ఫోన్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే..
ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 92 000 నుంచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మొత్తం మూడు కలర్ వేరియంట్స్ లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే.. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్సెట్ తో పనిచేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ను 128 జీబీ ర్యామ్, 512 జీబీ ర్యామ్ వేరియంట్ తో తీసుకొస్తున్నారు. అలాగే ఈ ఫోన్ 5750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుందట. ఇక ఈ ఫోన్లో 6.42 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ ఎల్టీపీఓ అవుటర్ డిస్ప్లేను ఇవ్వనున్నారు.
ఈ స్క్రీన్ 2550×1080 పిక్సెల్ రిజల్యూషన్ సెటప్తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరో స్క్రీన్ ను 7.85 ఇంచెస్ తో రానుందని సమాచారం. స్క్రీన్ 2కే రిజల్యూషన్ తో రానుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 32 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాను ఇవ్వనున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇవ్వనున్నారు.