భారత మార్కెట్లోకి షావోమీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షావోమీ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రెడ్మీ నోట్ 14 సిరీస్ తాజాగా ఇండియాలో విడుదల అయ్యింది. రాబోయే సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు.. రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్లస్లు పరిచయం చేసింది. ఇది 50ఎంపీ +2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కాకుండా, సెల్ఫీ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు. పవర్ బ్యాకప్ కోసం, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో 5110mAh బ్యాటరీని పొందే అవకాశం ఉంది. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను పొందవచ్చు. ఇది కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 సెక్యూరిటీ తో కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మీడియాటేక్ డిమెన్షన్ 7300 అల్ట్రా చిప్సెట్ రానున్నట్లు తెలుస్తోంది. 50ఎంపీ +8ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో ఈ స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేశారు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కూడా అందించారు. రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ కి 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే కూడా అందించనుంది. ఇది ఫోన్లో Qualcomm Snapdragon 7s Gen 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్లోని అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్ 50ఎంపీ +12ఎంపీ +50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో రావచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. 6200mAh బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.