ఏంటి.. నిజామా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లోకి ఐదువేల రూపాయల నోటును తీసుకువస్తుందా? అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు లాగే మళ్లీ గత బాధలో నడవ బోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. 2000 రూపాయల నోటును ఎప్పుడూ అయితే బ్యాన్ చేశారో అప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక కరెన్సీ విలువ 500 రూపాయలు. ఇండియాలో ఉన్న అతిపెద్ద నోటు ఇదే. అందుకే ఇండియాలో కొత్త 5000 రూపాయల నోట్లు లాంచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశ ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. భారతదేశంలో ఇంతకు ముందు 5000, 10000 రూపాయల నోట్లు ఉండేవి.సోషల్ మీడియాలో 5000 రూపాయల నోట్లపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన విధానాన్ని స్పష్టం చేసింది. అయితే అధిక విలువ కలిగిన నోట్లు భారత్. కు కొత్త కాదు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 5000, 10000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 1954లో 5000 రూపాయల నోటును భారత కరెన్సీలో చేర్చారు. 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం 1000, 5000, 10000 రూపాయల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఈ అధిక విలువైన నోట్లు భారతదేశంలో సుమారు 24 సంవత్సరాలుగా చెలామణిలో ఉన్నాయి. కొత్తగా ఆకుపచ్చరంగులో ఉండే రూ. 5000 నోటు గురించి ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.
ట్రెండింగ్ లో ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్లలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవమని, అలాంటి వార్తలను నమ్మకండి అంటూ కొట్టి పరేసింది. అలాగే ఈ పుకార్లలో వాస్తవం లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2000 నోట్లను మాత్రమే వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. 5000 రూపాయల నోట్లపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కాగా ప్రస్తుతం భారతదేశంలో 500, 200, 100, 50, 20,10 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను పెంచింది. డిజిటల్ చెల్లింపుల విధానంలో లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది. యూపీఐ సైబర్స్పేస్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు ఇప్పుడు నోట్లను భర్తీ చేస్తున్నాయి. కరెన్సీ వార్తలపై ప్రభుత్వ వనరులను మాత్రమే విశ్వసించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను చూసి కంగారు పడవద్దని తెలిపింది.