Oppo Pad: ఒప్పో నుంచి సరికొత్త ట్యాబ్..ధర ఎంతంటే..!!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీ అయిన ఒప్పో...లేటెస్టుగా ట్యాబ్లెట్ ను చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 11:45 AM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీ అయిన ఒప్పో…లేటెస్టుగా ట్యాబ్లెట్ ను చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా రానుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్…ఒప్పో ప్యాడ్ కు లైటర్ వెర్షన్ ఇది. కేవలం 440 గ్రాములే దీని బరువు. అత తక్కువ బరువుతో కూడిన ట్యాబుల్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు 6.94mmతో అతి పలుచగా ఈ ట్యాబ్ ఉంటుంది.

ఇందులో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ కూడా ఉంటుంది. మోస్తరు వేగంతో కూడిన, నమ్మకమైన ప్రొసెసర్. 10.36 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ , 60 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. బ్రైట్ నెస్ 360 నిట్స్ గా ఉంటుంది. 7,100ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఏర్పాటు చేశారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును ఇస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారంగా కలర్ osతో రన్ అవుతోంది. నాలుగు స్పీకర్లతో డాల్బీ ఆటమ్స్ సౌండ్ సిస్టం ఉంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఏర్పాటు ేశారు. స్టైలీష్ కీబోర్డ్ కీ సపోర్టు చేస్తుంది. స్డూడెంట్స్ కు ఈ ట్యాబ్ అనుకూలంగా ఉంటుంది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ. 15,000.ఇక మరో రెండు వెర్షన్ల ధరలు రూ. 19,800వరకు ఉన్నాయి.