ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ మొబైల్స్ కంపెనీలకు పోటీ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యం లోనే ఒప్పో సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అదే ఒప్పో ఎఫ్ 23 ప్రో. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. ఒప్పో ఎఫ్ 23 ప్రో స్మార్ట్ఫోన్లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు.
120హెర్జ్స్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. రిజొల్యూషన్ రేటు 2400×1080 పిక్సెల్స్ విత్ 580 నిట్స్ బ్రైట్నెస్గా ఉంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్తో పని చేసే ఈ స్మార్ట్ఫోన్లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ను అందించారు. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో తీసుకొచ్చారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండండి.
కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ను ఇచ్చారు ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 5జీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ ఫర్ చార్జింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు. కాగా స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే రూ. 24,999గా ఉండనుంది. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన ఒప్పో సంస్థ తాజాగా ఈ ఒప్పో ఎఫ్ 23 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. కాగా రెండు మూడు కలర్స్ లో లభించునుంది.