ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ లావా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది లావా సంస్థ. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? దాని ధర ఎంత అన్న వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంపెనీ లావా కేవలం రూ.5999కే 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. యువ అనే పేరుతో కేవలం రూ.5999కే 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు రంగులలో లభిస్తుంది.
గ్లోసీ లావెండర్, గ్లోసీ వైట్, గ్లోసీ బ్లూ వంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చట. కాగా లావా యువ స్మార్ట్ త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత హెూమ్ సర్వీస్ తోపాటు ఒక సంవత్సరం వారంటీ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే.. లావా యువ స్మార్ట్ 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేతో వస్తుంది. అలాగే 720 × 1600 పిక్సెల్ రిజల్యూషన్, 60 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 13 ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ సెన్సార్, సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది.
యునిసాక్ 98663ఏ ఆక్టా కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. లావా యువ స్మార్ట్ ఫోన్ 3జీబీ ర్యామ్ తో వస్తుంది. అలాగే తగినంత నిల్వ ఉంటే వర్చువల్గా మరో 3 జీబీను విస్తరించవచ్చట. ఇన్బుల్ట్ మెమరీ విషయానికి వస్తే.. ఇది 64 జీబీతో వస్తుంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డ్తో 512 జీబీ వరకు విస్తరించుకునే సౌలభ్యం ఉందట. లావా యువ స్మార్ట్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 10 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ప్రత్యేకతలుగా ఉన్నాయి..