Jio Tag: రిలయన్స్‌ జియో నుంచి మరో కొత్త పరికరం.. అదేంటంటే?

ప్రముఖ రిలయన్స్ సంస్థ జియో గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే జియో సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి తక్కువ ధరకే జియో ఫోన్ వైఫై రూటర్లను తీ

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 10:00 PM IST

ప్రముఖ రిలయన్స్ సంస్థ జియో గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే జియో సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి తక్కువ ధరకే జియో ఫోన్ వైఫై రూటర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా జియో మరో కొత్త పరికరాన్ని పరిచయం చేసింది. యాపిల్ ఎయిర్‌ ట్యాగ్‌, శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ట్యాగ్‌ తరహాలోనే జియోట్యాగ్‌ పేరుతో బ్లూటూత్‌ ట్రాకర్‌ ను తీసుకొచ్చింది జియో. తాళంచెవి, పర్స్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు మర్చిపోయే అలవాటున్న వారికి ఇది ఎంతోబాగా ఉపయోగపడుతుంది. కాగా ఈ జియోట్యాగ్‌ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

దీని అసలు ధర రూ.2,199గా ఉంది. అయితే ప్రస్తుతం వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఈ జియోట్యాగ్ కేవలం రూ.749కే లభిస్తోంది. జియో, రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుపు రంగులో ఉన్న ఈ చిన్న గ్యాడ్జెట్‌ బరువు 9.5 గ్రాములు. దీని పరిమాణం 38.2mm x 38.2mm x 7.2mm. తరచూ మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు దీన్ని తగిలించాలి. బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన జియోథింగ్స్‌ యాప్‌ కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు జియోట్యాగ్‌ తగిలించిన వస్తువును వదిలి నిర్దేశిత దూరం దాటి వెళ్లిపోతే వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది. ఇండోర్‌లో 20 మీటర్లు, అవుట్‌డోర్‌లో 50 మీటర్ల వరకు ఈ జియోట్యాగ్‌ పనిచేస్తుంది.

దీంట్లో మార్చుకోగలిగే CR2032 బ్యాటరీ ఉంది. దీనికి ఏడాది వారెంటీ ఇస్తున్నారు. జియోట్యాగ్‌ను పరికరాలను సులభంగా అటాచ్‌ చేసేలా ఒక కేబుల్‌ను కూడా అందిస్తున్నారు. జియోట్యాగ్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ను కూడా ట్రాక్‌ చేయవచ్చు. సైలెంట్‌ మోడ్‌లో ఉన్నప్పటికి జియోట్యాగ్‌ను రెండుసార్లు ట్యాప్ చేస్తే ఫోన్‌ మోగుతుంది. పరికరాల ట్రాకింగ్‌తో పాటు జియోట్యాగ్‌ తీసుకున్నవారికి జియో ఒక ప్రత్యేక సేవను అందిస్తోంది. జియోట్యాగ్‌ తగిలించిన పరికరాన్ని ఎవరైనా దొంగిలిస్తే దాన్ని జియోథింగ్స్‌ యాప్‌లోని జియో కమ్యూనిటీలో రిపోర్ట్‌ చేయవచ్చు.