ఇటీవల కాలంలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు ఉన్న క్రేజ్ అలాగే డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది వీటిని ఇష్టపడుతున్నారు. అందుకు అనుకున్నాంగానే ఇప్పటికే ఎన్నో రకాల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి విడుదల అయింది. మరి ఆ వివరాల్లోకి వెళితే. ఇన్ఫినిక్స్ కంపెనీ కూాడా జీరో ఫ్లిప్ పేరుతో పోర్టబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది. చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ తొలి ఫోర్టబుల్ ఫోన్ ను జీరోఫ్లిప్ పేరుతో దేశ మార్కెట్ లోకి విడుదల చేసింది.
దీని ధరను రూ.49,999గా నిర్ణయించారు. అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ఫ్లిప్ కార్డు లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్ లాంచ్ సందర్భంగా కంపెనీ కొన్ని బ్యాంకు ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు హోల్డర్లు రూ.3250 వరకూ తగ్గింపును పొందవచ్చు. కాగా ఈ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పోర్టబుల్ ఫోన్ లో అనేక ప్రత్యేకతులు ఉన్నాయి. అతిపెద్ద కవర్ డిస్ ప్లే, 4720 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ, మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్ ను ఏర్పాటు చేశారు. అలాగే 6.9 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ స్క్రీన్, 3.64 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లేతో డ్యూయల్ డిస్ ప్లే సెటప్ ఆకట్టుకుంది.
120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో విజువల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి. జీరోఫ్లిప్ ఫోన్ కేవలం 7.64 ఎంఎం మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో ప్రత్యేక మైన హూపర్ మోడ్ ను తీసుకువచ్చారు. రాక్ బ్లాక్, బ్లొసమ్ గ్రో రంగులలో అందుబాటులో ఉంది. 70 డబ్ల్యూ చార్జర్ తో బ్యాటరీని కేవలం 17 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చట. కెమెరా విషయంలో అదరహో అనిపించేలా తీర్చిదిద్దారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో పనిచేసే డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. లోపలి డిస్ ప్లేలో ఫ్రంట్ ఫేసింగ్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో సెల్పీలు చాలా నాణ్యతగా తీసుకోవచ్చు. ముందు, వెనుక కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తాయి. అదనంగా ఏఐ వ్లాగ్ మోడ్ ఫీచర్ కూాడా ఉందట.