Site icon HashtagU Telugu

PAN Card: ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా?

Pan Card

Pan Card

ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆర్థిక కార్యకలాపాలకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాగా ఈ పాన్ కార్డు నెంబర్ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు ఉన్న గుర్తింపు పత్రాలలో పాన్ కార్డు కూడా ఒకటి. ఇకపోతే చాలామందికి ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు కూడా ఉంటాయి. ఎక్కువసార్లు అప్లై చేయడం వల్ల కూడా ఇలా రెండు మూడు పాన్ కార్డులు వస్తూ ఉంటాయి. అయితే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి కేవలం ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందట.

మరి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారు? ఎంత చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్న విషయానికి వస్తే.. క్రెడిట్ కార్డ్ సైజులో ఉండే పాన్ కార్డ్‌లో వ్యక్తి పేరు, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీ, శాశ్వత ఖాతా నంబర్ ఉంటాయి. పాన్‌ కార్డు పై ఉన్న నంబర్‌ 12 ఉంటాయి. పాన్ నంబర్ అదే. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, రుణాలు, పెట్టు బడులు తదితరాలన్నీ పాన్ నంబర్ ద్వారా సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు. ఈ కారణంగా, పాన్ చాలా ముఖ్యమైన పత్రంగా చెప్పవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ నంబర్లను కలిగి ఉండకూడదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ నంబర్లు కలిగి ఉండటం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

ఈ రకమైన చట్టవిరుద్ధం గుర్తించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272 బి కింద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించవచ్చు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే, ఒకదానిని మాత్రమే ఉంచుకుని, మరొకటి సరెండర్ చేయడం మంచిది. లేకుంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే పాన్ కార్డును వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పాన్ కార్డును ఆధార్ నెంబర్ తో లింక్ చేయడం తప్పనిసరి.

ఆధార్‌తో లింక్ చేయని పాన్ నంబర్ చెల్లదు. ఉపయోగం కూడా ఉండదు. రెండు పాన్ నంబర్లు ఉన్న అనేక కేసులు ఉన్నందున, ఆదాయపు పన్ను శాఖ ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆధార్ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. పాన్‌ను కేటాయించే సమయంలో ఆధార్ లింక్ చేయబడుతుంది. 2017కి ముందు చేసిన పాన్ నంబర్‌ కు ఆధార్‌ను లింక్ చేయలేదు. వాటిని అనుసంధానం చేయాలి. ఇప్పుడు ఆధార్, పాన్ ఉచితంగా లింక్ చేయలేరు. లింక్ చేయడానికి నిర్దిష్ట రుసుము అవసరం అని ఆదాయపన్ను శాఖ తెలిపారు.