No Free Calls : వాట్సాప్ లో ఇక నుంచి నో ఫ్రీ కాల్స్ …?

వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ మామూలు కాల్స్ మాట్లాడటం చాలా వరకు తగ్గింది. 

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 03:07 PM IST

వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ మామూలు కాల్స్ మాట్లాడటం చాలా వరకు తగ్గింది.  1జిబీ డేటాతో గంటలకొద్దీ కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం ఉండేది. కానీ ఇక నుంచి వాట్సాప్ కాల్స్ కూడా ఉచితంగా మాట్లాడుకోలేమా అంటే నో అనే సమాధనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ కాలింగ్ విషయంలో టెలికాం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్ యాప్స్ కు కూడా వర్తింపజేయాలని టెలికాం సంస్థలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తమలాగే లైసెన్స్ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో త్వరలోనే వాట్సాప్ కాల్స్ పైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

వాట్సాప్, గూగుల్ మీట్, సిగ్నల్, లాంటి యాప్స్ తో చేసే ఇంటర్నెట్ కాల్స్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చాయి. వీటి నియంత్రణ విషయంలో నిబంధనలకు రూపొందించేందుకు అబిప్రాయాన్ని వెల్లడించాలని టెలికాం నియంత్రణ సంస్థని టెలికాం విభాగం అభిప్రాయం కోరింది. గతంలో ట్రాయ్ ఇంటర్నెట్ టెలిఫోనీ పేరిట 2008లో ట్రాయ్ చేసిన సిఫార్సులను డాట్ తిరిగి వెనక్కి పంపించింది. అయితే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమగ్రమైన సిఫార్సులతో ముందుకు రావాలని ట్రాయ్ కి సూచించినట్లు తెలుస్తోంది.

ఇక ఇంటర్నెట్ కాలింగ్ విషయంలోనూ టెలికాం ప్రొవైడర్లకు వర్తిస్తున్న నియమాలే కమ్యూనికేషన్ యాప్స్ కుకూడా వర్తింపజేయాలని టెలికాం సంస్థలు ఎప్పటినుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. తమ లాగే లైసెన్స్ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. 2016-17 లో నెట్ న్యూట్రాలిటీ గురించి పెద్దెత్తున చర్చ జరిగింది. టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ కాలింగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా ఆ యాప్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం.

కాగా గతంలోనూ ఇదే విషయంపై ట్రాయ్ కొన్ని సిఫార్సులు చేసింది. ఆయా యాప్స్ ఇంటర్ యూసేజ్ ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఆ సిఫార్సులను డాట్ పక్కన పెట్టింది. తర్వాత కాలంలో ఈ ఛార్జీల భారం నుంచి టెలికాం కంపెనీలకు ప్రభుత్వం కల్పించినప్పటికీ…ఈవ్యవహారంపై మళ్లీ డాట్ ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. సాంకేతికపరంగా దుర్వినియోగం అవుతోందన్న కారణంతోనే డాట్ ఈ వ్యవహారంపై కన్ను పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రాయ్ నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.