Site icon HashtagU Telugu

OpenAI ChatGPT Go: భారతీయ వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్

Chatgpt

Chatgpt

OpenAI ChatGPT Go: అమెరికా టెక్ కంపెనీ OpenAI భారతీయ వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ChatGPT Go ను ప్రారంభించింది. ఈ ప్లాన్ రూ. 399 (GST తో) చెల్లించవచ్చు. వినియోగదారులు దీన్ని సులభంగా UPI ద్వారా చెల్లించవచ్చు. ChatGPT Go ప్రధానంగా భారతీయ వినియోగదారులకు ఆధునిక AI టూల్స్ సులభంగా మరియు తక్కువ ఖర్చుతో అందించడానికి రూపొందించబడింది. ఈ ప్లాన్‌లోని అన్ని ఫీచర్లు GPT-5 ఆధారితంగా ఉంటాయి. వినియోగదారులు తమ భాషలో కూడా ChatGPT ను ఉపయోగించవచ్చు. ChatGPT Go ప్లాన్ ద్వారా ఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ మెసేజ్‌లు, రోజుకు 10 రెట్లు ఎక్కువ ఇమేజ్‌లు, రోజుకు 10 రెట్లు ఎక్కువ ఫైల్స్ లేదా ఇమేజ్‌లు అప్‌లోడ్ చేయవచ్చు. అదనంగా, వ్యక్తిగత సమాధానాల కోసం రెండు రెట్లు ఎక్కువ మెమోరీ ఉంది.

ఈ కొత్త ప్లాన్ ఇప్పటికే ఉన్న ChatGPT Plus (రూ. 1,999) తో పాటు ఉంటుంది. Plus ప్లాన్ వినియోగదారులకు ప్రాధాన్యత, వేగవంతమైన ప్రదర్శన, మరియు ఎక్కువ ఉపయోగ పరిమితులను అందిస్తుంది. అదనంగా, ChatGPT Pro ప్రొఫెషనల్స్ మరియు ఎంటర్ప్రైజ్ వినియోగదారుల కోసం ఉంది. Pro ప్లాన్ అత్యధిక స్కేలు, కస్టమైజేషన్, మరియు అధునాతన మోడల్స్ యాక్సెస్ అందిస్తుంది. దీని ధర రూ. 19,900 (GST తో).

India China Relations : భారత్-చైనా సంబంధాల్లో కొత్త పరిణామం

Nick Turley, ChatGPT విభాగం వైస్ ప్రెసిడెంట్, భారత్‌లో మిలియన్ల మంది వినియోగదారులు ChatGPT ను చదువు, పని, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం కోసం రోజువారీ ఉపయోగిస్తున్నారని చెప్పారు. ChatGPT Go ప్లాన్ ద్వారా ఈ సామర్థ్యాలను సులభంగా, తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. OpenAI ప్రకారం, భారత్ ChatGPT యొక్క రెండవ పెద్ద మార్కెట్ మరియు అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉంది.

సర్వే ప్రకారం, చాట్ జీపీటీ లైఫ్టైమ్ రెవెన్యూ ఫర్ ఇన్స్టాల్ పరంగా అన్ని పోటీదారులను మించిపోయింది. ChatGPT ఒక్క ఇన్‌స్టాల్‌కు సగటున $2.91 రాబడి సాధించింది. ఆంత్రోపిక్ క్లాడ్ $2.55, ఎలాన్ మస్క్ గ్రోక్ $0.75, మైక్రోసాఫ్ట్ కాపిలైట్ యాప్ కేవలం $0.27 మాత్రమే రాబడి సాధించింది. ఈ కొత్త చాట్ జీపీటీ గో ప్లాన్ ద్వారా, ఓపెన్ ఏఐ భారతీయ వినియోగదారులకు ఆధునిక AI సామర్థ్యాలను తక్కువ ఖర్చుతో అందించాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చింది.

CM Revanth Reddy: టీ ఫైబ‌ర్‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి: CM రేవంత్ రెడ్డి