Site icon HashtagU Telugu

Bsnl Plans: కొత్త ఏడాది సందర్బంగా తక్కువ ధరకే రెండు అద్భుతమైన ప్లాన్ లు తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్!

Bsnl

Bsnl

ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా కొత్త ఏడాది సందర్భంగా రెండు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు అయినా జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి వాటికీ దీటుగా కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్ లను తీసుకువస్తోంది. తక్కువ ధరకే అద్భుతమైన ప్లాన్లను తీసుకువస్తోంది. కాగా తాజాగా మరో రెండు చౌకైన ప్లాన్స్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు నూతన సంవత్సరం సందర్భంగా రెండు చౌక ప్లాన్‌ లను బహుమతిగా ఇచ్చింది. ఇందులో వినియోగదారులు ఉచిత SMS, ఉచిత కాలింగ్, అపరిమిత హై స్పీడ్ డేటాతో సహా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ ప్లాన్‌ లతో వినియోగదారులు తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఆప్షన్‌ ను కూడా పొందుతారు. ఇతర టెలికాం కంపెనీలు నిరంతరం తమ టారిఫ్ ప్లాన్‌ లను ఖరీదైనవిగా చేస్తున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్‌ తో తన మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. ఈ రెండు ప్లాన్‌ లు రూ.628, రూ.215 గా ఉన్నాయి. రూ. 628 ప్లాన్‌ లో కస్టమర్‌ లు 84 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇందులో కస్టమర్లకు రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు, వినియోగదారులు ప్రతిరోజూ ఉచిత అపరిమిత కాలింగ్, 100 SMS సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అంటే రూ.628 ఖర్చు చేయడం ద్వారా కస్టమర్లు దాదాపు 3 నెలల పాటు అన్ని సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

అలాగే రూ.628 కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులు ఒక నెల అనగా 30 రోజులు రోజుకు 2జీబీ డేటా పొందుతారు. అలాగే, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS సౌకర్యం అందిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ కాకుండా వినియోగదారులు జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రస్తుతం భారత టెలికాం రంగంలో ప్రధానంగా జియో, ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి 4 కంపెనీలు ఉన్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ ల వాటా గురించి మాట్లాడినట్లయితే సెప్టెంబర్ నెలలో కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ లో కంపెనీ మార్కెట్‌ వాటా 7.84 శాతం నుంచి 7.98 శాతానికి పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్ వాటా లక్ష్యాన్ని 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.