Site icon HashtagU Telugu

Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా.. అయితే ఈ కొత్త విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి?

Aadhaar Update

Aadhaar Update

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఇక భారత్ లో ఉన్నవారికి ఆధార్ కార్డు అన్నది అతి ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధారపకార్డును ఉపయోగిస్తూ ఉంటారు. గవర్నమెంట్, ప్రైవేట్, బ్యాంక్ ఇలా ఎన్నో వాటికి ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. అటువంటి ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే మనం వాటిని సరిచేసుకోవచ్చు. ఆధార్ కార్డు అన్నింటికీ కీలకం కాబట్టి కార్డులోని వివరాలు అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆధార్ అప్‌డేట్‌పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సరి కొత్త సర్క్యూలర్ ను జారీ చేసింది. యుఐడిఏఐ అందించిన సమాచారం ప్రకారం.. ఆధార్ అప్‌డేట్ లేదా ఇతర సర్వీసుల కోసం రిజిస్ట్రార్స్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు గరిష్ఠంగా ఎంత ఛార్జీలు వసూలు చేయాలనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారి ఆధార్ అప్‌డేట్, బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ జనరేషన్‌ వంటి వాటికి సైతం నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలకు పైన అయినప్పుడు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయకుండా ఉంటే వెంటనే అప్‌డేట్ చేయించుకోవాలి.

అయితే తాజాగా యూఐడీఏఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. 2023 మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే ఫ్రీగా ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏప్రిల్ 20 న ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యూలర్ ఎంబీసీ పాలసీని కొనసాగించడం, హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్ ప్రారంభించేందుకు నిబంధనలు వెల్లడించింది. ఇందులో కొత్త చార్జీలు కూడా వెల్లడయ్యాయి. 0 నుంచి 5 ఏళ్ళలోపు వయసున్న వారి ఆధార్ జనరేషన్ కోసం ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లినట్లయితే రూ.50 చెల్లించాలి. ఐదు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారు ఆధార్ జనరేషన్ కోసం 100 రూపాయలు ఇక బయోమెట్రిక్ అప్‌డేషన్ కోసం రూ. 100 చెల్లించాల్సి వస్తుంది. బయోమెట్రిక్ అప్‌డేషన్ కోసం రిజిస్ట్రార్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు రూ. 100 వసూలు చేస్తారు. డెమొగ్రాఫిక్ అప్‌డేట్ కోసం రూ.50 చెల్లించాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లో పీఓఐ డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం రూ. 50 చెల్లించాలి. అయితే మైఆధార్ పోర్టల్ ద్వారా అయితే రూ.25 మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ అప్డేషన్ హోమ్ ఎన్‌రోల్‌మెంట్ కోసం అదనంగా ఛార్జ్ చేస్తారు. అయితే, ఒకే అడ్రస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆధార్ అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి కార్డుకు రూ.700 తర్వాత ఒక్కోదానికి రూ.350 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.