టీ20 వరల్డ్కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో ఐర్లాండ్పై జింబాబ్వే గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటింగ్ లో రాజా (82 పరుగులు), మాదేవేరి (22 పరుగులు), జోంగ్వే (20 నాటౌట్) పరుగులు చేసి ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐర్లాండ్ బౌలింగ్ లో లిటిల్ 3 వికెట్లు తీయగా.. అధైర్, సిమి సింగ్ చెరో 2 వికెట్లు తీశారు.
తర్వాత 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జింబాబ్వే 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ బ్యాటింగ్ లో కాంఫెర్ (27 పరుగులు), డాక్ రెల్ (24), డెలనీ (24) పరుగులు చేశారు. జింబాంబ్వే బౌలింగ్ లో ముజార్బాని 3 వికెట్లు, చాతరా, నగరవా చెరో 2 వికెట్లు తీశారు.