Site icon HashtagU Telugu

WTC Final: 2031 వ‌ర‌కు అక్క‌డే.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ వేదిక‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ!

WTC 2025-27 Points Table

WTC 2025-27 Points Table

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి మూడు ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లను ఇంగ్లాండ్ ఆతిథ్యం వహిస్తుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఇప్పటివరకు జరిగిన మూడు WTC ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. ఇప్పుడు 2027, 2029, 2031 ఫైనల్‌లు కూడా ఇంగ్లాండ్ గడ్డపై జరగనున్నాయి. కొంతకాలం క్రితం BCCI వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను ఆతిథ్యం చేయాలనే కోరికను వ్యక్తం చేసింది. కానీ ICC ఈ కొత్త ప్రకటనతో BCCI 2031 వరకు ఉన్న ప్రణాళికలు నీరుగారిపోనున్నాయి

ICC ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. WTC ఫైనల్ గత మూడు విజయవంతమైన ప్ర‌యోజ‌నాల‌ను పరిగణనలోకి తీసుకుని ICC 2027, 2029, 2031లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ల ఆతిథ్య బాధ్యతను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB)కు అప్పగిస్తున్నట్లు నిర్ధారిస్తోందని తెలిపింది.

Also Read: Rishabh Pant: ఇంగ్లాండ్‌తో నాల్గ‌వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్‌!

2021లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లోని రోజ్ బౌల్ స్టేడియం ఆతిథ్యం వహించింది. ఇక్కడ న్యూజిలాండ్ భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2023లో జరిగిన ఫైనల్ ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగింది. ఈసారి ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను 209 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను సాధించింది. ఇక 2025లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియాకు 5 వికెట్ల తేడాతో విజయం లభించింది. ఈ నిర్ణయంతో ICC, WTC ఫైనల్స్ వేదిక ఎంపికలో ఇంగ్లాండ్‌కు ఉన్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది.ఈ నిర్ణయంతో ICC.. WTC ఫైనల్స్ వేదిక ఎంపికలో ఇంగ్లాండ్‌కు ఉన్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది.

ఇంతకుముందు క్రికెట్ నిపుణులు, పలువురు ఆటగాళ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను మరింత పోటీతత్వంతో, వైవిధ్యంతో నిర్వహించడానికి ఆసియా పిచ్‌లపై కూడా ఫైనల్‌లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. BCCI 2027 ఫైనల్ ఆతిథ్యం కోసం ఆసక్తిని వ్యక్తం చేసింది. కానీ భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోతే ఫైనల్ చూడడానికి వచ్చే అభిమానుల సంఖ్యలో క్షీణత నమోదు కావచ్చని ఐసీసీ భావిస్తోంది.