Site icon HashtagU Telugu

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

WPL 2026

WPL 2026

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 (WPL 2026) కోసం గురువారం ఢిల్లీలో వేలం జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ సీజన్ కార్యక్రమంపై కీలక ప్రకటన చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 జనవరి 9 నుండి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. అయితే వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 2026లోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కూడా భారతదేశంలో జరగనుంది. దీని కారణంగానే బీసీసీఐ ఆ ఐసీసీ ఈవెంట్‌కు ముందే డబ్ల్యూపీఎల్ నిర్వహించడానికి ప్రణాళిక వేసింది. డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?

బీసీసీఐ ప్రకారం.. వచ్చే సీజన్ మ్యాచ్‌లు నవీ ముంబై, వడోదరలో జరుగుతాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వడోదరలోని బీసీఏ స్టేడియంలలో మ్యాచ్‌లు ఆడబడతాయి. ఫైనల్ మ్యాచ్ వడోదరలో జరుగుతుంది. నవీ ముంబై గత కొన్ని సంవత్సరాలలో మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం చాలా ముఖ్యమైన వేదికగా ఉద్భవించింది. అయితే వడోదరలో జరగనున్న మ్యాచ్‌లు ఆ ప్రాంత ప్రజలలో తప్పకుండా ఉత్సాహాన్ని నింపుతాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లీగ్ నాల్గవ సీజన్ అవుతుంది. ఈ లీగ్ 2023లో ప్రారంభమైంది.

Also Read: Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

గత సీజన్ల విజేతలు

గత మూడు సీజన్‌లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సీజన్‌లలోనూ రన్నరప్‌గా నిలిచింది. 2023లో జరిగిన మొదటి సీజన్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 2024లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. 2025లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తమ రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

దీప్తి శర్మకు భారీ ధర

డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో మొదట దీప్తి శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించింది. దీని తర్వాత ఢిల్లీని ఎంత ధరకైనా కొంటారా అని అడగగా ఢిల్లీ రూ. 3.20 కోట్లు చెప్పింది. దీంతో యూపీ వారియర్స్ అదే రూ. 3.20 కోట్లకు దీప్తిని తమ జట్టులో చేర్చుకుంది. ఈ విధంగా దీప్తి శర్మ డబ్ల్యూపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది.

Exit mobile version