Site icon HashtagU Telugu

World Test Championship: వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో దూసుకెళ్లిన టీమిండియా.. ఫైన‌ల్ బెర్త్ ఖాయమా..?

World Test Championship

World Test Championship

World Test Championship: కాన్పూర్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మ్యాచ్‌లో రెండు, మూడో రోజు వరుసగా రెండు రోజులు వర్షం కురిసినా.. ఇలాంటి ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ సేన ఆ పని చేసింది.

ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా సరికొత్త శిఖరాగ్రాన్ని చేరుకుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టు ఘోరంగా ఓడిపోయింది. కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.

Also Read: Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..

కంగారూ జట్టు రెండో స్థానంలో ఉంది

మిగిలిన‌ జట్ల గురించి చెప్పాలంటే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. జట్టు PCT ప్రస్తుతం 62.50. WTC ఫైనల్‌కు ముందు కంగారూ జట్టు భారత్, శ్రీలంకలతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా ఈ పట్టికలో శ్రీలంక జట్టు 55.56 PCTతో మూడో స్థానంలో ఉంది. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం ఈ మూడు జట్లకే ఫైనల్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతర జట్ల పరిస్థితి ఏమిటి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు 42.19 విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు PCT 38.89తో ఐదవ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 37.50 PCTతో ఆరో స్థానంలో ఉంది. WTC ఫైనల్‌కు పాకిస్తాన్, వెస్టిండీస్‌ల అవకాశాలు దాదాపు ముగిశాయి. ఆ జ‌ట్ల‌ PCT వరుసగా 19.05, 18.52 వద్ద ఉంది.