Wicket Keeper: రిషబ్ పంత్ ప్రమాదానికి గురైనప్పటి నుండి భారత జట్టు స్థిరమైన వికెట్ కీపర్ (Wicket Keeper) బ్యాట్స్మెన్ కోసం వెతుకుతోంది. పంత్ ఇంకా కోలుకుంటున్నాడు. పంత్ స్థానంలో కేఎస్ భరత్కు టెస్టు జట్టులో అవకాశం లభించినప్పటికీ బ్యాటింగ్లో అతని ప్రదర్శన నిరాశపరిచింది. ఇటువంటి పరిస్థితిలో వెస్టిండీస్ పర్యటనలో ఆడే టెస్ట్ సిరీస్కు ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్లు వికెట్ కీపర్గా నిలిచే రేసులో ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా కూడా భారత జట్టు ప్రణాళికలో లేడు. సాహాకు 38 ఏళ్లు. ఇదే సమయంలో గాయపడిన పంత్ స్థానంలో సెలెక్టర్లు యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వైపు చూస్తున్నారు.
‘ఇన్సైడ్స్పోర్ట్స్’తో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మేము వృద్ధిమాన్ సాహాను మించి చూడాలి. అతను అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనడంలో సందేహం లేదు. అయితే అతడి వయసు 38 ఏళ్లు. అది మనం కోరుకోని స్టాప్-గ్యాప్ పరిష్కారం కావచ్చు. ఇషాన్, భరత్, ఉపేంద్ర వంటి యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దాలి. వారు ఇతరులకన్నా ఎక్కువగా విఫలమవుతారు. కానీ వారే భవిష్యత్తు.” అని పేర్కొన్నారు.
బ్యాటింగ్లో భారత్ ఫ్లాప్, ఇషాన్ ఫాస్ట్ బ్యాట్స్మెన్
రిషబ్ పంత్ గాయం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడుతున్న KS భరత్ కీపింగ్లో రాణించాడు. అయితే బ్యాటింగ్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. 8 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన భరత్ కేవలం 18.42 సగటుతో 129 పరుగులు మాత్రమే చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, రెండో ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
Also Read: Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?
మరోవైపు, యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. కీపింగ్లో ఇషాన్ అంత గొప్పగా లేకపోయినా బ్యాటింగ్లో మాత్రం చాలా దూకుడుగా ఉంటాడు. తెల్ల బంతితో పాటు ఇషాన్ ఫస్ట్ క్లాస్ ఫిగర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అతను ఇప్పటివరకు 48 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 38.76 సగటుతో 2985 పరుగులు చేశాడు. ఇషాన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ తన ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న వికెట్కీపర్ ఉపేంద్ర యాదవ్పై కూడా బీసీసీఐ దృష్టి ఉంది. ఉపేంద్ర తన ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 37 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్లలో 47 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసిన అతను 45.02 సగటుతో 1666 పరుగులు చేశాడు. వెస్టిండీస్ టూర్లో ఉపేంద్ర భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది. జూలై 12 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా జూలై మొదటి వారంలో విండీస్ చేరుకోనుంది. ఈ వారంలో వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లకు సంబంధించిన జట్లను ప్రకటించి, ఆ తర్వాత టీ20 సిరీస్ని ప్రకటించబోతున్నారు.