ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 6 జట్లు ఫిక్స్.. మిగిలిన 2 స్థానాల కోసం 3 జట్లు రేసులో

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) 2025 పాకిస్థాన్‌లో జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
ICC Champions Trophy

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) 2025 పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీలో టాప్-8 జట్లు పాల్గొంటాయి. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. ఆతిథ్య జట్టుగా పాక్ జట్టు నేరుగా ప్రవేశం పొందుతుంది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి 6 జట్లను ఖరారు చేశారు. మిగిలిన 2 స్థానాలకు 3 దేశాలు పోటీదారులుగా ఉన్నారు.

మిగిలిన 2 స్థానాల కోసం 3 జట్లు రేసులో

వాస్తవానికి ఈ ప్రపంచకప్‌లో టాప్-8 జట్లు ICC ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. అయితే ఈ టోర్నీలో మిగిలిన 2 స్థానాల కోసం 3 జట్లు రేసులో ఉన్నాయి. ఈ పోరులో ఇంగ్లండ్‌తో పాటు నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఇప్పుడు న్యూజిలాండ్.. శ్రీలంకను ఓడించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలన్న శ్రీలంక ఆశలు అడియాసలయ్యాయి. అంటే ఇప్పుడు శ్రీలంక జట్టు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించదు.

Also Read: World Cup Semifinal: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఆ జట్టే.. నాలుగో బెర్తుపై క్లారిటీ..!

ఇంగ్లండ్‌తోపాటు బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ కూడా పోటీలో ఉన్నాయి

ప్రస్తుతం ఇంగ్లండ్‌ 8 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో ఉండగా ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓడిపోగా 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు టాప్-8లో చేరితే ఐసీసీ ఛాంపియన్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లండ్‌తో పాటు నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌లు పోటీలో ఉన్నాయి. బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌లలో 4 పాయింట్లను కలిగి ఉంది. కానీ నెట్ రన్ రేట్‌లో ఇంగ్లాండ్ కంటే తక్కువగా ఉంది. నెదర్లాండ్స్ కూడా 8 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించింది. డచ్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే పదో స్థానంలో ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ 2025 పాకిస్థాన్‌లో జరగడం గమనార్హం. ఈ కారణంగా పాకిస్తాన్ నేరుగా ప్రవేశిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 10 Nov 2023, 09:34 AM IST