Ashwin: ఆ సమయంలో నా భార్యాపిల్లలే నన్ను నిలబెట్టారు- రవిచంద్రన్ అశ్విన్!!

2020-2021లో ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టుపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు.

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 06:30 PM IST

2020-2021లో ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టుపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ ను నెగ్గిన భారత్ చరిత్రను క్రియేట్ చేసింది. ఆ భారత టీంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హనుమ విహారితో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసి…మ్యాచ్ ను డ్రాగా ముగించేశాడు. ఆ సమయంలో హనుమ విహారితోపాటు అశ్విన్ కూడా గాయాలపాలయ్యాడు. తాజాగా ఈ మ్యాచ్ గురించి అశ్విన్ స్పందించాడు. ఆ మరపురాని సిరీస్ విజయం ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ రిలీజ్ అశ్విన్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరికీ గాయాలయ్యాయని…క్రీజులో సౌకర్యవంతంగా కదల్లేకపోయామని చెప్పాడు. విహారికి తొడకు గాయమైందని…చాలా బాధను అనుభవించినట్లు చెప్పాడు. తాను కూడా గాయంతో ఫాస్ట్ బౌలింగ్ లో ఆడలేకపోయానని చెప్పాడు. విహారి ఫాస్ట్ బౌలర్లు..తాను స్పిన్ బౌలర్లు ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక రూపొందించుకున్నామని గుర్తుచేశాడు. ఒకరినొకరం కమ్యూనికేట్ చేసుకుంటూ..ముందుకెళ్లామని ఈ సందర్బంగా గుర్తు చేశాడు అశ్విన్. గాయంతో బాధపడుతూనే 13 నుంచి 14ఓవర్లు బౌలింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో నొప్పి భరించలేక నేల మీద పోర్లానని చెప్పాడు. ఆ సయమంలో తన భార్యా పిల్లలే తనను నెలబెట్టారని అశ్విన్ తెలిపారు. ఆ తర్వాత మ్యాచ్ కు తాను పాకుతూ వెళ్లానని…ఆటలో రాణించానని అశ్విన్ చెప్పాడు.