Abhimanyu Easwaran: అభిమన్యు ఈశ్వరన్‌కు త‌ప్ప‌ని నిరీక్షణ.. లోపం ఎక్క‌డ జ‌రుగుతోంది?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అవకాశానికి అర్హులని చెప్పారు. కానీ, వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Abhimanyu Easwaran

Abhimanyu Easwaran

Abhimanyu Easwaran: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు జరిగాయి. కరుణ్ నాయర్ వరుస వైఫల్యాల కారణంగా ప్లేయింగ్ 11 నుండి తొలగించబడగా, అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సుదీర్ఘ టెస్ట్ డెబ్యూ చేస్తాడని అంతా ఆశించారు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వేరే నిర్ణయం తీసుకున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో సాయి సుదర్శన్‌కు మరోసారి అవకాశం ఇవ్వగా, అభిమన్యు ఈశ్వరన్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అభిమన్యు 2021-22 నుండి భారత టెస్ట్ జట్టుతో ఉన్నప్పటికీ టీమ్ ఇండియా జెర్సీ ధరించి మైదానంలోకి దిగే అతని కల ఇప్పటివరకు నెరవేరలేదు.

అభిమన్యు ఈశ్వరన్ నిరీక్షణ

గత నాలుగు సంవత్సరాలుగా భారత టెస్ట్ జట్టులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ జట్టు ఆట‌గాళ్ల‌ కోసం నీళ్లు అందిస్తూనే ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను చాలా సమయం గడిపినప్పటికీ టీమ్ ఇండియా జెర్సీలో ఆడే కల కేవలం కలగానే మిగిలిపోయింది. అభిమన్యు జట్టులో చేరిన తర్వాత నుండి 15 మంది ఆటగాళ్లు టెస్ట్ డెబ్యూ చేశారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్, రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్లు కూడా ఉన్నారు. అయితే అభిమన్యు దేశీయ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించినప్పటికీ బెంచ్‌పైనే విశ్రాంతి తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అభిమన్యు పేరిట 27 శతకాలు, 7,841 పరుగులు ఉన్నాయి. అలాగే 31 అర్ధశతకాలు కూడా వచ్చాయి.

Also Read: Shubman Gill: భార‌త్ చెత్త రికార్డును మార్చ‌లేక‌పోతున్న శుభ‌మ‌న్ గిల్‌!

దేశీయ క్రికెట్ గురించి కొంతకాలం క్రితం పెద్ద చర్చ జరిగింది. ప్రతి ఒక్కరూ దేశీయ క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అవకాశానికి అర్హులని చెప్పారు. కానీ, వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. కోచ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఉన్న అభిమన్యుకు న్యాయం చేయలేకపోతున్నారు. సుమారు 8,000 పరుగులు, 27 శతకాలు సాధించినప్పటికీ ఒక బ్యాటర్ నాలుగు సంవత్సరాలుగా బెంచ్‌పైనే కూర్చుంటే దేశీయ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని చూపించడం వల్ల ఏ ప్రయోజనం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

అభిమన్యు vs సుదర్శన్ గణాంకాలు

సాయి సుదర్శన్: ఇప్పటివరకు మొత్తం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 36 సగటుతో 1,987 పరుగులు సాధించాడు. 51 ఇన్నింగ్స్‌లలో కేవలం 7 శతకాలు, 5 అర్ధశతకాలు మాత్రమే సాధించాడు.

అభిమన్యు ఈశ్వరన్: 103 మ్యాచ్‌లు ఆడి 54 సగటును కలిగి ఉన్నాడు. అనుభవం నుండి బ్యాటింగ్ రికార్డు వరకు అభిమన్యు.. సుదర్శన్ కంటే చాలా ముందున్నాడు. సుదర్శన్ ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసినందున మాత్రమే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.

  Last Updated: 23 Jul 2025, 08:09 PM IST