Site icon HashtagU Telugu

Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. శుభమన్ గిల్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli- Rohit Sharma) చాలా కాలం తర్వాత క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగింది. అయితే ఇది రోహిత్-విరాట్‌లకు పెద్దగా కలిసి రాలేదు. మొదటి మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు భారత జట్టు పెర్త్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి అడిలైడ్‌కు చేరుకుంది. ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుండి అద్భుతమైన ప్రదర్శనను అభిమానులు ఆశిస్తున్నారు.

రోహిత్-విరాట్ ప్రాక్టీస్ ప్రారంభం

చాలా కాలం తర్వాత రోహిత్, విరాట్ మైదానంలోకి తిరిగి రావడం అంత గొప్పగా లేదు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు విఫలమయ్యారు. అయితే ఇప్పుడు అడిలైడ్‌లో రోహిత్-విరాట్ జట్టు కోసం పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాలని చూస్తున్నారు. పెర్త్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ఉండాలని భావిస్తున్నారు.

Also Read: Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్!

అడిలైడ్ చేరుకున్న తర్వాత రోహిత్, విరాట్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు దాదాపు 1 గంట పాటు తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగా, విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

అడిలైడ్ వన్డే కీలకం

పెర్త్ వన్డే గెలిచి ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి, శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టుకు అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చావోరేవో లాంటిది. టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. ఒకవేళ భారత్ ఓడిపోతే సిరీస్‌ను కూడా చేజార్చుకుంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా శుభమన్ గిల్ తన తొలి వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించ‌టం అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డు.

Exit mobile version