Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్కు భారతరత్న ఇవ్వాలి లేదా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా ఫోగాట్ తన మహిళల 50 కిలోల ఫైనల్కు ముందు 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్స్కు అనర్హుడైంది , అసమానమైన స్వర్ణానికి చేరువైన కొన్ని గంటల్లోనే ఆమె పతకాన్ని కోల్పోయింది.
వినేష్ ఫోగట్ అసాధారణ నైపుణ్యాన్ని గుర్తించి రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ సీటుకు ఆమెను నామినేట్ చేయాలి అని బెనర్జీ ఎక్స్లో పోస్ట్లో పేర్కొన్నారు. ఆమె ప్రదర్శించిన అసాధారణ ధైర్యాన్ని గుర్తించాలని ట్విటర్లో రాశారు. సంకల్పం, పట్టుదలతో మీరు సాధించిన అపురూపమైన విజయాన్ని మాటల్లో చెప్పలేమని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. మీరు 140 కోట్ల మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు నింపారు. మీరు ఎప్పటికీ యోధురాలుగానే మిగిలిపోతారు. మేము మీకు అండగా ఉంటాము. దేశం మొత్తం మీకు అండగా నిలుస్తోందని పార్టీ పేర్కొంది.
వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కిలోల రెజ్లింగ్ ఫైనల్కు అనర్హతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆమె సెమీస్ తర్వాత బరువుపెరిగింది. ఫైనల్ నాటికి ఆమె బరువు తగ్గేందుకు కష్టపడింది. ఆహారం, నీళ్లు తీసుకోలేదు. నిద్ర కూడా పోలేదు. వ్యాయామం, ఆవిరి స్నానం చేసింది. ఉదయం నాటికి ఆమె బరువు 50.1కేజీలు తగ్గింది. అధిక బరువును తగ్గించడానికి సమయం లేకపోవడంతో ఆమెపై వేటు పడింది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?