Site icon HashtagU Telugu

India: యూఏఈపై భారత్‌ భారీ విజయం!

India

India

India: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత జట్టు (India) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై 148 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ‘ఏ’కి ఇదే తొలి గెలుపు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఏ’ జట్టు 297 పరుగుల భారీ స్కోరు సాధించగా.. 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో యూఏఈ జట్టు కేవలం 149 పరుగులకే పరిమితమైంది.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లో శతకం

భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో యువ బ్యాట్స్‌మెన్ల ప్రదర్శన కీలకం. వైభవ్ సూర్యవంశీ తుఫాను వేగంతో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 42 బంతులు ఆడి 144 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని బ్యాట్ నుండి 15 భారీ సిక్సర్లు, 11 ఫోర్లు వచ్చాయి. ఆ తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ కూడా యూఏఈ బౌలర్లను చిత్తు చేశాడు. జితేష్ 32 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ సాధించిన 297 పరుగులు ఐదవ అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. కేవలం నేపాల్, జింబాబ్వే, ఇంగ్లండ్ మాత్రమే 300 పరుగుల మార్కును దాటగలిగాయి.

Also Read: Eyesight: దృష్టి లోపం, కంటి సమస్యలు.. ఏ విటమిన్ల లోపం కారణమంటే?

బౌండరీల సునామీ

భారతీయ బ్యాట్స్‌మెన్‌లు తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 25 సిక్సర్లు, 24 ఫోర్లు కొట్టి మొత్తం 297 పరుగులు చేశారు. ఇందులో బౌండరీల ద్వారానే 246 పరుగులు వచ్చాయి. అత్యధికంగా వైభవ్ సూర్యవంశీ 15 సిక్సర్లు కొట్టగా, జితేష్ శర్మ 6 సిక్సర్లతో అలరించాడు. బౌలింగ్‌లో భారత్ తరఫున గుర్జ్‌పనీత్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు తీసి యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశాడు.

గ్రూప్ Aలో భారత్ అగ్రస్థానం

148 పరుగుల భారీ విజయం తర్వాత భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను గెలుచుకుని గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్‌ను గ్రూప్ Bలో కాకుండా గ్రూప్ A లో పాకిస్తాన్, ఒమన్, యూఏఈలతో పాటు ఉంచారు.

Exit mobile version